News February 16, 2025
గద్వాల: రైలు ఢీకొని వ్యక్తి మృతి

గద్వాల పట్టణంలోని మొదటి రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. రైల్వే ఫ్లై ఓవర్ కింద ప్రమాదం జరగడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. వ్యక్తిని గుర్తించిన వారు గద్వాల రైల్వే పోలీస్ సెల్ 8341252529 నంబర్కు కాల్ చేయాలన్నారు.
Similar News
News December 2, 2025
నల్గొండ: రెండో దశకు నేటితో తెర..!

రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లాలోని 10 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు 1,703 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇక మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం వరకు ఉంది. ఈ నేపథ్యంలో రెబెల్స్ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, BRS నేతలు యత్నిస్తున్నారు. రెండో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టి సారించారు.
News December 2, 2025
HYD: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

కోవైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు వస్తున్న ఇండిగో (6e 1234) విమానానికి బాంబు బెదిరింపు మేయిల్ వచ్చింది. అర్దరాత్రి 1:30 నిమిషాలకు బయలుదేరిన విమానం ఉదయం 8:10 శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు విమానం చేరుకుంది. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. ముంబయిలో ఇంకా ల్యాండింగ్ కానీ విమానం భయం గుప్పెట్లో ఫైలెట్ తోపాటు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
News December 2, 2025
నల్గొండ: పల్లెల్లో పార్టీల ఫైట్..!

సర్పంచ్ ఎన్నికల్లో గుర్తులు లేకున్నా.. పార్టీలకు పల్లెపోరు ప్రతిష్ఠాత్మకంగానే మారింది. తాము బలపర్చే అభ్యర్థులను గెలిపించుకునేందుకు కాంగ్రెస్, BRS సీరియస్గా పనిచేస్తున్నాయి. డీసీసీ పదవి చేపట్టిన పున్న కైలాస్ నేత క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీని పంచాయతీలోనూ గెలిపించుకుందామంటూ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు BRS, BJP తమ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం యత్నిస్తున్నాయి.


