News March 31, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన ఎర్రవల్లి సమీపంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల మం. గుంటిపల్లికి చెందిన రాజన్న(60) శనివారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజన్న అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News December 24, 2025

ముస్లింలపై దారుణాల గురించి రాయాలని ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

image

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రొఫెసర్ అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ప్రొ.వీరేంద్ర బాలాజీ ‘INDలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి’ అని BA సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న అడిగారు. ప్రశ్నాపత్రం SMలో వైరల్ కాగా ఇది రాజకీయ, మతపరమైన పక్షపాతంతో రూపొందించిన ప్రశ్న అని వర్సిటీకి ఫిర్యాదులందాయి. కమిటీని ఏర్పాటు చేసిన వర్సిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేసింది.

News December 24, 2025

నేటి నుంచి VHT.. పంత్ మెరుస్తారా?

image

విజయ్ హజారే ట్రోఫీ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రూపు-Dలో తొలి మ్యాచ్ ఆంధ్ర, ఢిల్లీ జట్ల మధ్య జరగనుంది. ఢిల్లీ సారథిగా పంత్ బరిలోకి దిగుతుండగా విరాట్ సైతం సందడి చేయనున్నారు. కొన్నాళ్లుగా టెస్టులకే పరిమితమైన పంత్ VHTని సద్వినియోగం చేసుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది. మరోవైపు ముంబై జట్టులో రోహిత్, పంజాబ్ టీంలో గిల్, అభిషేక్ తదితర స్టార్ ప్లేయర్లు మెరవనున్నారు.

News December 24, 2025

అధికారులను జైలుకు పంపిస్తాం: హరీశ్ రావు

image

పోస్టింగులు, ప్రమోషన్ల కోసం సీఎం రేవంత్‌కు సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వదిలిపెట్టబోమని హరీశ్ రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. రిటైర్ అయినా, డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లినా తప్పించుకోలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆధారాలు లేకున్నా రేవంత్‌కు సహకరిస్తున్న వారిని వదలమని పేర్కొన్నారు.