News April 6, 2025

గద్వాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నిన్న గద్వాలలో జరిగింది. స్థానికుల వివరాలు.. కర్ణాటకలోని యరగెరకు చెందిన శ్రీనివాసులు(55) గద్వాలలో శుభకార్యానికి హజరై సాయంత్రం ఆరగిద్దలోని తన కూతురు దగ్గరికి బైక్‌పై బయలుదేరాడు. గొర్లఖాన్‌దొడ్డి-ఆరగిద్దల మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డుపై అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలవటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యంలో చనిపోయాడు.

Similar News

News November 12, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి: MP

image

MHBD జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశా కమిటీ ఛైర్మన్, MP బలరాం నాయక్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంను కొనుగోలు కేంద్రాల సంఖ్య ప్రజావాసరాల దృష్ట్యా అట్టి సంఖ్యను పెంచి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News November 12, 2025

GWL: ‘పీఆర్‌ఓ’ పోలీస్‌ వ్యవస్థకు ముఖచిత్రం: ఎస్పీ

image

ప్రజా సంబంధాల విభాగం (పీఆర్‌ఓ) పోలీస్ వ్యవస్థకు ముఖచిత్రం లాంటిదని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన మూడు రోజుల శిక్షణలో గద్వాల పీఆర్‌ఓ నవీన్ పాల్గొన్నారు. బుధవారం డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా నవీన్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లాకు మంచి పేరు తెచ్చినందుకు ఎస్పీ ఆయనను అభినందించారు.

News November 12, 2025

PDPL: శతాబ్ది ఉత్సవాలకు విజయవంతం చేయాలి: సీపీఐ

image

కార్మిక, కర్షకుల, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీపీఐ అని జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అన్నారు. ఖమ్మంలో జరిగే శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లిలోని పార్టీ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల కరపత్రం ఆవిష్కరించారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరగనున్న మహాసభకు పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.