News November 18, 2024
గద్వాల: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈ

గద్వాల జిల్లాలో పంచాయితీరాజ్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఎర్రవల్లి మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మైనారిటీ షాదిఖానా భవన నిర్మాణ పనులకు బిల్లులు చేయడానికి ఇటిక్యాల మండల పంచాయితీరాజ్ ఏఈ పాండురంగారావు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఈక్రమంలో నేడు ఏఈ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
గల్లంతైన ఆరు గ్యారంటీలు: డీకే అరుణ

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజల ముందు పెట్టి గెలిచారని మహబూబ్ నగర్ డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తిగా గల్లంతయ్యాయని విమర్శించారు. రెండు సంవత్సరాల విజయోత్సవాలు జరుపుకునే అర్హత వారికి లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
News December 7, 2025
MBNR: కాంగ్రెస్ ప్రజా వంచన పాలన: MP

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలు అమలుచేయకుండా ప్రజావంచన పాలన కొనసాగిస్తుందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరాపార్క్ దగ్గర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగభృతి, మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఎలక్ట్రికల్ స్కూటీలు తదితర పథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.
News December 7, 2025
MBNR: రెండో దశలో 239 మంది సర్పంచ్ల విత్డ్రా

స్థానిక సంస్థల రెండో దశ ఎన్నికల్లో మొత్తం 239 మంది సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 151 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో అత్యధికంగా 58 మంది, కోయిలకొండలో 55 మంది నామినేషన్లను వెనక్కి తీసుకున్నట్టు ప్రకటనలో వెల్లడించారు.


