News March 11, 2025
గద్వాల: లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్

ప్రభుత్వ నిబంధనల మేరకు లేఅవుట్ల అభివృద్ధి జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం గద్వాల్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్లు 898, 900, 93 ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ లేఅవుట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లే అవుట్ల అభివృద్ధిలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.
Similar News
News November 13, 2025
కాణిపాకంలో జైళ్ల శాఖ డీజీపీ

కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారిని గురువారం జైళ్ల శాఖ డీజీపీ ఆంజనీ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి చిత్రపటం బహుకరించారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
News November 13, 2025
జైళ్ల శాఖ డీజీపీని కలిసిన చిత్తూరు SP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ అంజనీ కుమార్ను గురువారం చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆయన్ను పోలీసు గెస్ట్ హౌస్లో కలిసి బొకే అందజేసి స్వాగతం పలికారు. అలాగే అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు ఆయన్ను కలిశారు.
News November 13, 2025
NRPT: సమాచార కమిషనర్ల రాక

నారాయణపేటకు శుక్రవారం సమాచార కమిషనర్లు వస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు శ్రీనివాసరావు, మౌసిన పర్వీన్ కలిసి పౌర సమాచార అధికారులకు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లు పరిశీలించి పరిష్కరిస్తారని అన్నారు.


