News April 5, 2025

గద్వాల: ‘వక్ఫ్ సవరణ బిల్లుతో ఆర్థిక ప్రయోజనాలు’

image

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎ.పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చారిత్రాత్మకమని అన్నారు. బిల్లును క్రమబద్ధీకరించడంతో భవిష్యత్తులో ముస్లిం సమాజానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. సమావేశంలో రవికుమార్ ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News November 15, 2025

IPL2026: అన్ని జట్ల రిటెన్షన్ జాబితా ఇదే

image

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటెన్షన్ జాబితాను అన్ని జట్లు ప్రకటించాయి. SRH అభినవ్, అథర్వ, సచిన్ బేబీ, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపాను వదులుకుంది. కేకేఆర్ ఆశ్చర్యకరంగా ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది. అన్ని టీమ్స్ పూర్తి జాబితాను పైన ఫొటోల్లో చూడండి.

News November 15, 2025

బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన iBOMMA నిర్వాహకుడు!

image

TG: కూకట్‌పల్లిలో <<18292861>>iBOMMA<<>> నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి కీలక సమాచారం రాబట్టారు. అతడు విశాఖ వాసి అని, విదేశీయులతో కలిసి హ్యాకింగ్ చేసినట్లు తెలుస్తోంది. OTTకి వచ్చిన సినిమాలను వెంటనే పైరసీ చేసి సైట్‌లో పెట్టి, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేశాడని గుర్తించారు. సర్వర్ల పాస్‌వర్డులు సంపాదించారు. వందల హార్డ్‌డిస్కులు సీజ్ చేశారు. దీనిపై సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

News November 15, 2025

21న జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఈనెల 21న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో లక్ష్మణరావు తెలిపారు. కాకినాడ జడ్పీ కార్యాలయ హాలులో ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశాలకు అధికారులందరూ తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఆయన శనివారం ఆదేశించారు.