News April 29, 2024

గద్వాల: ‘వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోండి’

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల జిల్లా వైద్యాధికారిణి డా.శశికళ సూచించారు. వడదెబ్బకు గురికాకుండా సురక్షితంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటికి వెళ్తే తెల్లటి బట్టలు ధరిచండం, తరచుగా నీటిని తీసుకోవడం వంటివి చేయాలన్నారు.

Similar News

News December 11, 2025

MBNR: మల్లేపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు లింగం గెలుపు

image

మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ తొలి ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లింగం 364 ఓట్ల మెజారిటీతో మరో అభ్యర్థి కావలి భాస్కర్‌పై గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు లింగంకు అభినందనలు తెలిపారు.

News December 11, 2025

MBNR: 11 గంటల వరకు 56.63%.. మరికొద్ది నిమిషాలే టైం..!

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల సందర్భంగా ఉదయం 11 గంటల సమయానికి 56.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరికొద్ది సేపు మాత్రమే ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News December 11, 2025

మహబూబ్‌నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.