News March 21, 2025

గద్వాల: సుంకేసుల డ్యామ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2025

నెల్లూరు: ప్రభుత్వ అధికారి సస్పెండ్

image

దుత్తలూరు-1 VROగా పని చేస్తున్న చింతలచెరువు శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలను తహశీల్దార్ యనమల నాగరాజు వెల్లడించారు. గతంలో ఏరుకొల్లు VROగా పనిచేస్తున్న సమయంలో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడంతో పాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

News December 5, 2025

రాజమహేంద్రవరం: 7న ‘శ్రీ షిర్డిసాయి’లో స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

image

పదో తరగతి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆదివారం మెగా స్కాలర్‌షిప్‌ టెస్ట్‌, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ షిర్డిసాయి విద్యాసంస్థల డైరెక్టర్‌ టి.శ్రీవిద్య తెలిపారు. బీజపురి క్యాంపస్‌లో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. జేఈఈ, నీట్‌, సివిల్స్‌ కోర్సులపై నిపుణులు దిశానిర్దేశం చేస్తారని చైర్మన్‌ తంబాబత్తుల శ్రీధర్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9281030301 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News December 5, 2025

అమెరికాలో ఇద్దరు తెలుగు స్టూడెంట్స్ మృతి

image

అమెరికాలోని బర్మింగ్‌హోమ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అలబామా యూనివర్సిటీలో చదివే 10 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.