News March 16, 2025

గద్వాల: 12 మందిపై కేసు నమోదు

image

మద్యం మత్తులో దాడులు చేసుకున్న 12మందిపై కేసు నమోదైన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు, వడ్లవీధికి చెందిన మరికొందరు, తెలుగుపేటకు చెందిన ఓ నాయకుడి అనుచరులు హోలీఆడి స్నానంచేసేందుకు కృష్ణానదికి వెళ్లారు. ఇరు వర్గాలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా అక్కడా దాడులు చేసుకున్నారు. దీంతో 12మందిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.

News December 5, 2025

KMR: మూడు నెలలుగా వేతనాలు అందట్లేదని DMHOకు వినతి

image

కామారెడ్డి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.విద్యకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో ఇళ్లల్లో భారం ఏర్పడి, జీవితాలు కొనసాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందేలా ఉన్నతాధికారులకు నివేదించాలని కోరారు.

News December 5, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ జిల్లా వ్యాప్తంగా పాఠశాలలలో మెగా ptm 3.0:ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
➤ జిల్లాలో విద్యుత్ షాక్ ఘటనలో ఇద్దరికీ గాయాలు
➤ నర్సీపట్నంలో అమృత మహిళా క్యాంటీన్ ను ప్రారంభించిన స్పీకర్
➤ నాలుగు కేజీల గంజాయితో తమిళనాడు వాసి అరెస్ట్
➤ పన్ను వసూలు పై నర్సీపట్నం మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్
➤ బాధ్యతలు స్వీకరించిన నూకాంబిక అమ్మవారి ఆలయ ఈవో
➤ వాడ్రాపల్లిలో మధ్యాహ్న భోజనం పై నిలదీసిన పేరెంట్స్