News April 4, 2025
గద్వాల: ‘14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలి’

గద్వాల జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో శుక్రవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అదే విధంగా బూత్ స్థాయి వరకు ప్రాథమిక సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
Similar News
News December 6, 2025
కృష్ణా: నకిలీ సిమ్లు.. మరో 8 మందికి సంకెళ్లు

వినియోగదారుల ఆధార్ వివరాలు, వేలిముద్రలతో అక్రమంగా సిమ్ కార్డులను యాక్టివేట్ చేస్తున్న సైబర్ మోసగాళ్ల ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు ముమ్మరం చేసి, తాజాగా మరో 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో కృష్ణా జిల్లా పెడన ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉండగా, ఈ మోసాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
News December 6, 2025
VZM: రెస్ట్ కోసం కారు ఆపితే..!

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు <<18484112>>స్వాములు<<>> అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు. వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.


