News March 18, 2025

గద్వాల: 7వ రోజుకు చేరిన ఎమ్మార్పీఎస్ నిరసన దీక్ష

image

ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గద్వాల రాజీవ్ మార్గ్‌లో చేపట్టిన నిరసన దీక్ష మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు పూడూరు చెన్నయ్య దీక్షకు మద్దతు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు తమ ప్రభుత్వం అనుకూలం అంటూనే చట్టబద్ధత కల్పించడంలో వెనకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 6, 2025

సమాచార హక్కు చట్టం.. సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం: కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాల వేడుకలు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిందని, సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం అన్నారు. అధికారులు నిర్ణీత సమయంలో సమాచారం ఇవ్వాలని నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే పరిస్థితి సీరియస్ అవుతుందని పేర్కొన్నారు.

News December 6, 2025

NTR: SSC నామినల్ రోల్స్ ఎడిట్ ఆప్షన్

image

యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లో SSC నామినల్ రోల్‌ విద్యార్థుల పరీక్ష వివరాల సవరణ కోసం ఎడిట్ ఆప్షన్ డిసెంబర్ 6న అందుబాటులోకి వచ్చిందని ఉప విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్‌రావు తెలిపారు. సబ్జెక్టులు, సీడబ్ల్యూఎస్‌ఎన్ స్థితి, ఫోటోలు, సంతకం వంటి లోపాలను సరిచేయాలని ఆయన సూచించారు. యూడైస్‌ ప్లస్‌లో చేసిన మార్పులు 24 గంటల్లో బీఎస్‌ఈ పోర్టల్‌లో ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతాయని స్పష్టం చేశారు.

News December 6, 2025

దంపతులకు దత్తత ఫైనల్ ఆర్డర్ అందజేసిన కలెక్టర్

image

ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఫ్రీ అడాప్షన్ పోర్టల్ ద్వారా 8నెలల చరణ్ బాబుకు తుది దత్తత ఆర్డర్‌ను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అందజేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన దంపతులకు ఈబిడ్డను దత్తత ఇచ్చారు. బాబును చూసుకునే విధానం, పోషణ, ఇమ్యునైజేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, దత్తత తీసుకున్న వారిని సొంత తల్లిదండ్రులుగా గుర్తించి ఫైనల్ ఆర్డర్ ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.