News April 2, 2025
గద్వాల PSలో జిల్లా ఎస్పీ తనిఖీ

గద్వాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కేసుల విషయమై పలు వివరాలను అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఉన్న జైలు గదులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మొగలయ్య, సీఐ శ్రీను, ఎస్ఐ కళ్యాణ్రావు ఉన్నారు.
Similar News
News November 11, 2025
ఇరిగేషన్ శాఖకు రూ.52.5 కోట్ల నష్టం

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికంగా పడింది. ప్రధానంగా మున్నేరు ఉదృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాల్లో కాలువలు కోతకు గురయ్యాయి. వంతెనలు దెబ్బతిన్నాయి. మైనర్ ఇరిగేషన్ డామేజ్ 91 ప్రాంతాల్లో జరగగా రూ.32.5cr నష్టం వాటిల్లింది. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.12.5cr, మేజర్ ఇరిగేషన్ రూ.7.5cr, కల్వర్టులకు రూ. 3.64cr వరకు ఖర్చవుతాయని అధికారులు తేల్చారు.
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
News November 11, 2025
భద్రాద్రి పాలకమండలి ఏర్పాటుపై పడని ముందడుగు

భద్రాద్రి రామాలయానికి ఉమ్మడి ఏపీలో 2012 NOV 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. అనంతరం పాలకమండలి ఏర్పాటుపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 50మందికి పైగా దరఖాస్తు సమర్పించారు. అయినా నేటికి పాలకమండలి ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. 3రోజుల క్రితం సర్కారు సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.


