News December 17, 2024

గన్నవరం: కన్నతల్లిని నడిరోడ్డుపై వదిలేసిన కసాయి బిడ్డలు

image

నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆ బిడ్డలకు భారమైంది. వృద్ధాప్యంలో అన్నీ తామై చూసుకోవల్సిన బిడ్డలే ఆ తల్లిని కాదనుకుని నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నడిరోడ్డుపై ఉన్న ఆ వృద్ధురాలిని చూసిన స్థానికులు పోలీసుల సహకారంతో గన్నవరంలోని PKR వృద్ధాశ్రమంలో చేర్పించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వృద్ధురాలి పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

Similar News

News December 21, 2025

కృష్ణా: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

image

కృష్ణా జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?

News December 21, 2025

బందరు – ప్రయాగ్‌రాజ్‌ మధ్య ప్రత్యేక రైలు

image

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మచిలీపట్నం – ప్రయాగ్‌రాజ్ (07401) మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 22న సాయంత్రం 4:20 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరి.. గుడివాడ, విజయవాడ, వరంగల్ మీదుగా మరుసటి రోజు ఉదయం 4:30 గంటలకు గమ్యస్థానం చేరుతుంది. ఇందులో ఏసీ, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.

News December 20, 2025

కృష్ణా: మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్ నడిపిన కలెక్టర్

image

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగంగా కృష్ణా కలెక్టరేట్‌లో శనివారం ‘క్లీన్ & క్లీన్’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్ బాలాజీ వినూత్నంగా స్పందించారు. స్వయంగా మున్సిపాలిటీ చెత్త ట్రాక్టరును నడిపి, ప్రాంగణంలోని వ్యర్థాలను సేకరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొని కలెక్టరేట్ మూలమూలలా పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.