News July 18, 2024
గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్

బెంగళూరు పర్యటనను ముగించుకొని మాజీ సీఎం జగన్ గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. జగన్కు విమానాశ్రయంలో వైసీపీ నాయకులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆయన తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
Similar News
News February 13, 2026
కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కోసం లోకేశ్ ఆత్మీయ విందు

మంత్రి లోకేశ్ కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల కుటుంబాల కోసం నిర్వహించిన ఆత్మీయ విందు రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందని మంత్రి కొల్లు కొనియాడారు. నిరంతరం ప్రజాసేవలో తలమునకలయ్యే నాయకుల కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం లోకేశ్కే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విందు కార్యక్రమం కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచిందని, ఇలాంటి నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News February 12, 2026
కృష్ణా: పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్.. ఏఆర్ సిబ్బందికి శిక్షణ

ఏఆర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక మొబిలైజేషన్లో భాగంగా మంగినపూడి బీచ్ వద్ద గల ఫైరింగ్ రేంజ్లో గురువారం ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది తమ గురిని పరీక్షించుకున్నారు. విధి నిర్వహణలో ఆయుధాల వినియోగంపై పట్టు సాధించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
News February 12, 2026
రాష్ట్ర సెక్రటేరియట్లో కృష్ణా జిల్లా ప్రణాళికలపై చర్చ

కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిథుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.


