News April 8, 2025

గన్నవరం: చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

image

గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ఆత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మార్చి 31వ తేదీ రాత్రి ద్వారకా రాణి అనే మహిళ తన భర్తాతో కలిసి బైక్‌పై పొట్టిపాడు వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 16 కాసుల బంగారాన్ని రెండు బైక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 30, 2025

అవనిగడ్డ నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

image

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోడూరు మండలంలో పర్యటించనున్నట్లు ఏపీ సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి, 8:30 గంటలకు నాగాయలంకలో, 10:30 గంటలకు కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని ఆయన ప్రకటనలో వివరించారు.

News October 29, 2025

కృష్ణా: 46,357 హెక్టార్లలో పంట నష్టం

image

తుపాన్ ధాటికి జిల్లాలో 46,357 హెక్టార్లలో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు. 427 గ్రామాల పరిథిలో ఈ పంట నష్టం జరగ్గా 56,040 మంది రైతులు నష్టపోయారన్నారు. 45,040 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ 288 హెక్టార్లలో, 985 హెక్టార్లలో మిముము, 43 హెక్టార్లలో పత్తి పంట నష్టపోయిందన్నారు.

News October 29, 2025

సీఎం షెడ్యూల్ మార్పు.. అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పర్యటన.?

image

సీఎం చంద్రబాబు షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఆయన నేడు కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించనున్నారు. కాగా, అవనిగడ్డ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఆయన రోడ్డు మార్గంలో కోడూరు, నాగాయలంక మండలాలను సందర్శించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని సమాచారం.