News February 13, 2025
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి.. నేడు నిందితుల బెయిల్పై తీర్పు

టీడీపీ గన్నవరం నియోజకవర్గ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల బెయిల్పై ఇవాళ తీర్పు వెలువడనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్ట్ చేశారు. కేసులో 88 మందిని నిందితులుగా చేర్చగా ఇప్పటికే 45మందిని అరెస్ట్ చేశారు. కాగా ఫిర్యాదుదారుడు సత్యవర్దన్ తనకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, భయపెట్టి ఫిర్యాదు చేయించారని సోమవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News November 22, 2025
జగిత్యాల అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి బాధ్యతలు

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా శేషాద్రిని రెడ్డి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో విధుల్లో చేరిన అనంతరం, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కొత్త అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించడంతో జిల్లా పోలీసు వ్యవస్థలో చైతన్యం నెలకొనున్నదని అధికారులు పేర్కొన్నారు.
News November 22, 2025
ఏలూరులో కాలువలో దూకిన మహిళ

ఏలూరు పవర్పేటకు చెందిన పూడి ఎర్రయ్య శనివారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని అతని భార్య నారాయణమ్మ మధ్యాహ్న సమయంలో తంగెళ్లమూడి వంతెన పైనుంచి తమ్మిలేరులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించి, చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News November 22, 2025
మెట్పల్లి: ‘నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి’

ముత్యంపేట్ నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని MLC అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్పల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెరుకు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.500 బోనస్ చెల్లించాలన్నారు. జిల్లా BJP అధ్యక్షుడు యాదగిరి బాబు, రఘు, రమేష్, రాజేందర్ తదితరులున్నారు.


