News February 4, 2025

గన్నవరం: ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

image

గన్నవరం మండలం చనుపల్లివారిగూడెంకు చెందిన కుచిపూడి సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు… సోమవారం రామవరప్పాడు రింగ్ వద్ద బైక్‌పై వెళ్తూ లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Similar News

News February 4, 2025

కృష్ణా: అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో BA.LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ మంగళవారం విడుదలైంది. ఫిబ్రవరి 10, 12, 14, 17, 19 తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టు వారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

News February 4, 2025

ఆ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలో SC, ST కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావుతో కలిసి జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పౌర హక్కుల రక్షణ, అట్రాసిటీ నివారణ చట్టం, మాన్యువల్ స్కావెంజింగ్ చట్టాల అమలు తీరును కమిటీ సభ్యులతో చర్చించారు.

News February 3, 2025

చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి సారించండి: కలెక్టర్

image

0-5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారుల చైల్డ్ ఆధార్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్, కలెక్టర్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 38 వేల వరకు పెండింగ్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.

error: Content is protected !!