News March 20, 2025
గన్నవరం: బాలికపై అఘాయిత్యం.. వెలుగులోకి కీలక విషయాలు

గన్నవరం మండలంలో బాలికపై అత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 13న గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అపహరించి 14 మధ్యాహ్నం వరకు పారిశ్రామికవాడలో నిర్బంధించారు. 14న కేసరపల్లిలో ఖాళీ గదికి తరలించి, 17వరకు మద్యం, గంజాయి ఇచ్చి బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం విజయవాడలో వదిలేశారు. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారంతా గంజాయి కేసుల్లో పాత నేరస్థులని గుర్తించారు.
Similar News
News March 31, 2025
కోడూరు: బాలికపై అనుచిత ప్రవర్తన..పోక్సో కేసు నమోదు

కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది.
News March 31, 2025
కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.
News March 31, 2025
VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.