News February 10, 2025
గన్నవరం: భార్య డబ్బులు ఇవ్వలేదని.. భర్త ఆత్మహత్య

గన్నవరం మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వీరపనేనిగూడానికి చెందిన రానిమేకల వీరబాబు (44) మద్యానికి బానిసై, భార్య డబ్బులివ్వలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 9, 2026
కృష్ణా: పీజీఆర్ఎస్కు 152 అర్జీలు

కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 152 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పరిష్కార చర్యల నిమిత్తం బదిలీ చేశారు. పంచాయతీ రాజ్కు సంబంధించి అధిక అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు.
News February 9, 2026
బందరు పోర్టుకు ‘షిప్ బిల్డింగ్’ కళ.. ఎంపీ బాలశౌరి హర్షం

మచిలీపట్నం పోర్టులో నౌకల నిర్మాణం, మరమ్మతుల సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై ఎంపీ వల్లభనేని బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బందరు పోర్టు రూపురేఖలను మార్చివేస్తుందని, దీనివల్ల పోర్టుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో విడుదల చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
News February 9, 2026
కృష్ణా: వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలంటూ జేసీకి వినతి

వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని వైసీపీ మైనార్టీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలార్ దాదా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంజుమన్కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వవద్దు అని, ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


