News March 14, 2025
గన్నవరం: వల్లభనేని వంశీని వదలని కేసులు

వల్లభనేని వంశీపై నమోదైన 2 కేసుల్లో గురువారం పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం, ఆత్కూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో, పోలీసులు గన్నవరం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీపై, ఈ కేసుల్లో విచారణ చేపట్టేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కేసుల విచారణ కోసం త్వరలోనే వంశీని కోర్టు ముందుకు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 19, 2025
DRC సమావేశాలను సీరియస్గా తీసుకోండి: బుద్ధప్రసాద్

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
News December 19, 2025
పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
News December 19, 2025
పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.


