News April 5, 2025

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న “జాక్” మూవీ టీమ్

image

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “జాక్” ప్రమోషన్స్ కోసం చిత్రబృందం శనివారం విజయవాడ విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈనెల 10న విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. 

Similar News

News November 29, 2025

SRCL: ‘ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును పకడ్బందీగా నమోదు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యులు ప్రచారంలో భాగంగా చేసే వ్యయం వివరాల నమోదుపై శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సహాయ వ్యయ పరిశీలకులకు పాల్గొన్నారు

News November 29, 2025

VKB: స్థానిక ఎన్నికలు.. ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్

image

వికారాబాద్ జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఈరోజు జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మూడు దశల్లో జరగనున్న ఎన్నికల ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, బందోబస్తుపై అధికారులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 608 పోలీస్ లొకేషన్లలో ఎన్నికలు జరగనున్నాయన్నారు.

News November 29, 2025

లింగంపల్లి స్టేషన్ అభివృద్ధి చేయాలి: రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి!

image

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రవికుమార్ యాదవ్ పరిశీలించారు. సికింద్రాబాద్, నాంపల్లి టెర్మినల్స్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 45 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. లింగంపల్లిని కూడా అభివృద్ధి చేయాలని రవికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.