News April 5, 2025
గన్నవరం విమానాశ్రయం చేరుకున్న “జాక్” మూవీ టీమ్

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ “జాక్” ప్రమోషన్స్ కోసం చిత్రబృందం శనివారం విజయవాడ విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం మూవీ టీమ్తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈనెల 10న విడుదల కానున్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Similar News
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<
News November 26, 2025
SBI సరికొత్త రికార్డు.. షేర్ వాల్యూ@రూ.999

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI సరికొత్త రికార్డు నమోదుచేసింది. ఇవాళ సంస్థ స్టాక్ దాదాపు 3 శాతం పెరగడంతో విలువ ఆల్టైమ్ హై రూ.999కి చేరింది. స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి రూ.1000 కూడా దాటొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా సంస్థ వ్యాపార విలువ రూ.100 లక్షల కోట్లకు చేరినట్లు ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 26, 2025
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ సంతకం

రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన బుధవారం కోటి సంతకాల సేకరణ ఫారంపై సంతకం చేసి తన వ్యతిరేకతను తెలియజేశారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.


