News March 12, 2025

గరిడేపల్లి మండల వాసికి గ్రూప్-1 జాబ్

image

గరిడేపల్లి మండల పరిధిలోని చిన్నగారకుంట తండాకి చెందిన భూక్యా సందీప్ గ్రూప్-1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించారు. ఇదివరకే ఎస్‌జీటీగా ఉద్యోగం సాధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం గుండెపురిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. గతంలో వరుసగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దీంతో వారి ఎంపిక పట్ల మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.

Similar News

News March 22, 2025

IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

image

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.

News March 22, 2025

ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

News March 22, 2025

సంగారెడ్డి: చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి నుంచి మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు 100% చెల్లించిన ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!