News February 22, 2025

గరివిడి: గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయుడు

image

గరివిడి మండలంలోని కొండదాడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రామారావు(50) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం పాఠశాలలో ప్రార్థన ముగిసిన తరువాత అసౌకర్యంగా ఉండడంతో రామారావు బాత్ రూమ్ కు వెళ్లారు. ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News October 29, 2025

సిద్దిపేట జిల్లాలో 212.8 మీ.మీ వర్షపాతం

image

మొంథా తుపాను కారణంగా సిద్దిపేట జిల్లాలో 212.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా హుస్నాబాద్ 212.8 మి.మీ, అక్కన్నపేట 207.0 మి.మీ రికార్డు అయింది. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో రెడ్ అలర్ట్ మోగింది. అత్యల్పంగా దౌల్తాబాద్ 15.8మీ.మీ, అక్బర్పేట భూంపల్లి మండలాల్లో 18, నంగునూర్ మండలంలో 13.88 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News October 29, 2025

దుడ్డుఖళ్ళు పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన DMHO

image

గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖళ్ళు పీహెచ్సీ, ఆశ్రమ పాఠశాలను DMHO భాస్కరరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను సిబ్బంది సమయపాలన పరిశీలించారు. వార్డులో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆశ్రమ పాఠశాలకు వెళ్లి డార్మెంటరీను తనిఖీ చేసి విద్యార్థులకు పెడుతున్న పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఆయన వెంట RBSK జగన్ మోహన్ రావు ఉన్నారు.

News October 29, 2025

ఈ మార్గాల్లో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచనున్న రైల్వే

image

గుంటూరు-పగిడిపల్లి, మోటమర్రి(ఖమ్మం)-విష్ణుపురం(నల్గొండ) సెక్షన్ల మధ్య విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మెరుగుపరచడానికి రైల్వే ఆమోదం తెలిపింది. రూ.188 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాబోయే మూడేళ్లలో దీనిని పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు మార్గాలు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సరకు, ప్యాసింజర్ రైళ్ల సేవలను మరింత వేగవంతం చేయనున్నాయి.