News January 1, 2025
గర్భిణులకు పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్
100 శాతం గర్భిణులకు అనుబంధ పోషకాహారాన్ని అందించాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ అంశాలపై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బాల్యవివాహాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 14, 2025
‘సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
సంక్రాంతి పండగ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. సోమవారం బండి ఆత్మకూరు మండలం పెద్దదేవలాపురంలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, మహిళలపై నేరాలు, చీటింగ్లపై అవగాహన కల్పించారు. గ్రామ స్థాయి సమస్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, డెయిల్ 100, 1930, 112 టోల్ ఫ్రీ నంబర్ల ఉపయోగాలను ప్రజలకు వివరించారు.
News January 13, 2025
BREAKING: నంద్యాల ఏఎస్పీగా మందా జావళి
2021-22 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఏఎస్పీగా మందా జావళి ఆల్ఫోన్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లాలో ట్రైనీ IPSగా మందా జావళి శిక్షణ పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా మరోవైపు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా యుగంధర్ బాబు విధులు నిర్వర్తిస్తున్నారు.
News January 13, 2025
ప్రజలకు నంద్యాల జిల్లా ఎస్పీ సూచనలు
సంక్రాంతి పండుగ జిల్లా ప్రజలందరి జీవితాలలో నూతన కాంతులు, సంతోషాలు నింపాలని నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుతో సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భోగి, మకరసంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.