News May 11, 2024

గల్లా మాధవిపై ఫేక్ ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవిపై సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ పార్టీ నాయకులు బి.వి రామాంజనేయులు పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కులాలు, మతాలు, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News April 22, 2025

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం

image

మంగళగిరి మండలం నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణానికి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభించింది. ఈ పని కోసం కన్సల్టెన్సీ సంస్థల నుంచి మే 14లోగా ఆర్ఎఫ్‌పీలు (ప్రతిపాదనలు) కోరుతూ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం నిర్మాణంతో పాటు అక్కడి ప్రధాన రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ డిజైన్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించనున్నారు.

News April 22, 2025

పెదకూరపాడు: సివిల్స్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ

image

పెదకూరపాడుకు చెందిన సామాన్య రైతు బిడ్డ చల్లా పవన్ కళ్యాణ్ సివిల్స్‌లో 146వ ర్యాంకు సాధించి సంచలనం సృష్టించాడు. పట్టుదలతో చదివి ఈ ఘనత సాధించినట్లు పవన్ తెలిపాడు. పవన్ విజయం జిల్లాకే గర్వకారణమని స్థానికులు కొనియాడారు. మంచి ర్యాంకు రావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News April 22, 2025

గుంటూరు వాహినిలో 25 వరకు తాగునీటి విడుదల

image

గుంటూరు జిల్లా తాగునీటి చెరువులను నింపాలని గుంటూరు వాహినికి ఈ నెల 25 వరకు తాగు నీటిని విడుదల చేస్తున్నామని, ఆయా తటాకాలను నీటితో నింపుకోవాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ ఉప్పుటూరి సాంబశివరావు తెలిపారు. 25వ తేదీ తర్వాత మరమ్మతుల నిమిత్తం కాలువకు నీరు నిలిపివేస్తామని, రాబోయే రోజులలో పెదనందిపాడు మండల ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని కోరారు.

error: Content is protected !!