News March 8, 2025

గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన విశాఖ మహిళ

image

స్టీల్ సిటీ గల్లీ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయిన మొదటి మహిళగా యర్రాజీ జ్యోతి చరిత్ర సృష్టించారు. విశాఖలో సూర్యనారాయణ, కుమారి దంపతులకు ఆగస్టు 28, 1999న జన్మించిన జ్యోతి, నేడు ఒలింపిక్స్‌లో పోటీ చేసి, దేశం గర్వించేలా ఎదిగారు. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్‌‌ 12.78 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డు సృష్టించారు. 2024లో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.

Similar News

News September 17, 2025

GVMC జోన్-3 పరిధిలో 26న బహిరంగ వేలం

image

GVMC జోన్- 3 పరిధిలో దుకాణాలు, కళ్యాణ మండపాలు, రోడ్ సైడ్ మార్కెట్లకు సెప్టెంబర్ 26న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ బుధవారం తెలిపారు. జోన్ పరిధిలోని షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపాలు, పలు వార్డుల్లో వ్యాపార సముదాయాలను వేలం వేస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు GVMC జోన్-3 జోనల్ ఆఫీసు వద్ద ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరుకావాలన్నారు.

News September 17, 2025

విశాఖ: పిల్లల ఉచిత శిక్షణా కార్యక్రమాలు పునఃప్రారంభం

image

VMRDA బాలల ప్రాంగణంలో పిల్లల కార్యక్ర మాలు సెప్టెంబర్ 21 నుంచి ప్రతి ఆదివారం పునఃప్రారంభమవుతాయని ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ బుధవారం వెల్లడించారు. విద్యార్థులకు ఇంగ్లీష్, పబ్లిక్ స్పీకింగ్, సంగీతం, డ్రాయింగ్, సైన్స్, కథా విన్యాసం, ఆర్ట్ & క్రాఫ్ట్, క్విజ్, AI కోడింగ్, కాలిగ్రఫీ, మ్యాథ్స్, నటన వర్క్‌షాప్, కెరీర్ గైడెన్స్ వంటి విభాగాలలో ఉచిత శిక్షణ అందిస్తారు.

News September 17, 2025

విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

image

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్‌లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.