News March 8, 2025

గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్లిన విశాఖ మహిళ

image

స్టీల్ సిటీ గల్లీ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఒలింపిక్స్‌కు సెలక్ట్ అయిన మొదటి మహిళగా యర్రాజీ జ్యోతి చరిత్ర సృష్టించారు. విశాఖలో సూర్యనారాయణ, కుమారి దంపతులకు ఆగస్టు 28, 1999న జన్మించిన జ్యోతి, నేడు ఒలింపిక్స్‌లో పోటీ చేసి, దేశం గర్వించేలా ఎదిగారు. మహిళల 100 మీటర్స్ హర్డిల్స్‌‌ 12.78 సెకన్లలో పూర్తి చేసి, జాతీయ రికార్డు సృష్టించారు. 2024లో అర్జున్ అవార్డుకు ఎంపికయ్యారు.

Similar News

News November 28, 2025

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

image

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News November 28, 2025

విశాఖ జూ పార్కుకు కొత్త నేస్తాల రాక

image

విశాఖ జూ పార్కుకు జంతు మార్పిడి విధానంలో కొత్త జంతువులు తీసుకొచ్చారు. జార్ఖండ్ రాష్ట్రం బిర్ష జూ పార్కు నుంచి హిమాలయన్ నల్లని ఎలుగుబంట్లు, గరియల్, స్పార్టెడ్ డవ్, సిల్వర్ పీజంట్ అనే జంతువులను, పక్షులను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడి జూకి పంపించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన వీటిని కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.

News November 28, 2025

జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్‌కు 21 వినతులు

image

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.