News March 12, 2025
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: KTR

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Similar News
News November 15, 2025
ఈ ఆయుర్వేద ఉత్పత్తులతో లివర్కు ప్రమాదం: డా.ఫిలిప్స్

అధిక ఆర్సెనిక్, పాదరసం ఉన్న ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగంతో కాలేయానికి నష్టమని డాక్టర్ అబీ ఫిలిప్స్ రాసిన ఆర్టికల్ను మెక్గిల్ విశ్వవిద్యాలయం(కెనడా) ప్రచురించింది. ఈ లోహాల విషప్రభావం కాలేయాన్ని దెబ్బతీయడంతో పాటు ఆరోగ్య సమస్యలు తెస్తుందని ఆయన తెలిపారు. ఈ ఉత్పత్తులపై నాణ్యత, నియంత్రణ లేకపోవడమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. వీటిని ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News November 15, 2025
చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసిన సతీశ్?

మాజీ AVSO సతీశ్ హత్య కేసును గుత్తి రైల్వే పోలీసులు తాడిపత్రికి బదిలీ చేశారు. చనిపోయిన రోజు రాత్రి సతీశ్ తన భార్యకు 1.20 గంటలకు ఫోన్ చేసినట్లు సమాచారం. 4 సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ‘డిస్ కంఫర్ట్’గా ఉందని వాట్సాప్ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆయన ఈమెసేజ్ చేశారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సతీశ్ను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
మోడల్ సిటీగా శ్రీసిటీ విస్తరణ: CBN

AP: మరో 50 కంపెనీల ఏర్పాటుకు వీలుగా 6వేల ఎకరాలతో శ్రీసిటీని విస్తరిస్తామని CBN తెలిపారు. 1.5 లక్షల ఉద్యోగాలతో ఇది మోడల్ సిటీగా మారుతుందన్నారు. బెల్జియం, జపాన్, UK, జర్మనీ, ఆస్ట్రేలియా తదితర దేశాల హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు. త్వరలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. CII సదస్సులో 5 యూనిట్లను వర్చువల్గా CM ప్రారంభించారు.


