News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News November 28, 2025

సాలూరు: వేధిస్తున్నాడంటూ వ్యక్తిపై మహిళ ఫిర్యాదు

image

సాలూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కారుణ్య నియామకం కోసం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ఓ మంత్రి వద్ద అనధికారిక పీఏగా విధులు నిర్వహిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని మరోసారి రుజువైందని వైసీపీ Xలో ఆరోపించింది.

News November 28, 2025

పల్నాడు: వెంటపడొద్దు అన్నందుకు చంపేశారు..!

image

బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రేమిడిచర్లలో శామ్యేల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యువతి తన తండ్రికి చెప్పడంతో ఆయన సదరు యువకుడిని తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి తండ్రిని రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI షమీర్ బాషా తెలిపారు.

News November 28, 2025

జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

image

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.