News March 12, 2025
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: KTR

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Similar News
News October 14, 2025
మీ స్కిన్టైప్ ఇలా తెలుసుకోండి

మన చర్మతత్వాన్ని బట్టి ఉత్పత్తులు ఎంచుకోవాలి. లేదంటే ఎన్ని కాస్మెటిక్స్ వాడినా ఉపయోగం ఉండదు. మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకోవాలంటే చర్మంపై వివిధ ప్రాంతాల్లో బ్లాటింగ్ పేపర్ను పెట్టాలి. తర్వాత ఆ షీట్ను వెలుతురులో చెక్ చేయాలి. ఆయిల్ కనిపించకపోతే మీది పొడి చర్మం, నుదురు, ముక్కు దగ్గర ఆయిల్ ఉంటే మీ చర్మం డ్రై, ఆయిల్ కాంబినేషన్ స్కిన్ అని, పేపర్ పూర్తి ఆయిల్గా కనిపిస్తుంటే ఆయిలీ స్కిన్ అని అర్థం.
News October 14, 2025
“బర్త్ రేట్ “లో నెల్లూరు ఎక్కడంటే?

రాష్ట్ర వ్యాప్తంగా birth rate ను పరిశీలిస్తే జిల్లాలో 1000 మంది బాలురుకు 1011 మంది బాలికలు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. లింగ వివక్షకు సంబంధించి చట్టాలు కఠినంగా ఉండడంతో కొంతమేరా వీటికి అడ్డుకట్ట పడినట్లు తెలుస్తోంది. అయితే ఏదొక మూల వైద్య శాఖ కళ్లు గప్పి లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయానేది సమాచారం.
News October 14, 2025
NGKL: ‘పోలీస్ అమరవీరుల’ దినోత్సవం.. వ్యాసరచన పోటీలు

అక్టోబరు 21న నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్లైన్ వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు.