News March 12, 2025

గవర్నర్‌తో అబద్దాలు చెప్పించారు: KTR

image

రాష్ట్రంలో సాగునీటి సంక్షోభం తీవ్రమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 30% మించి రైతు రుణమాఫీ జరగలేదని రుణమాఫీ అయిపోయిందని గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు.

Similar News

News March 27, 2025

భద్రాద్రి: జిల్లాలో కాంగ్రెస్ ప్రక్షాళన జరుగుతుందా?

image

కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో నేడు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో భాగంగా జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. KTDM జిల్లా డీసీసీ చీఫ్‌గా పోదెం వీరయ్య ఉన్నారు. అయితే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలామంది పోటీపడుతున్నారు. ఈ పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.

News March 27, 2025

వరంగల్ : బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బైకుపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపల్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2025

వనపర్తి జిల్లాలో మండుతున్న ఎండలు..! 

image

వనపర్తి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అత్యధికంగా కనాయిపల్లిలో 40.9℃ ఉష్ణోగ్రత నమోదైంది. రేమద్దుల 39.8, కేతేపల్లి 39.7, పెబ్బేరు, వెల్గొండ 39.6, గోపాలపేట 39.4, దగడ 39.3, విలియంకొండ 39.2, విపనగండ్ల 39.1, శ్రీరంగాపురం, పంగల్ 39, జనంపేట, ఆత్మకూర్ 38.9, రేవల్లి 38.8, వనపర్తి 38.7, మదనాపురం 38.6, సోలిపూర్ 38.4, పెద్దమందడి 38.1, ఘనపూర్ 37.9, అమరచింతలో 37.7℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!