News March 18, 2025
గవర్నర్ను కలిసిన కోనసీమ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కోరుకొండ సత్యనారాయణ కలిశారు. మంగళవారం విజయవాడలో రెడ్ క్రాస్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్తో పాటు కోనసీమ రెడ్ క్రాస్ ఛైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు. కోనసీమలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి గవర్నర్కు వివరించారు.
Similar News
News July 11, 2025
NZB: కూలీల కొరత.. పొరుగు రాష్ట్రాల నుంచి బారులు

నిజామాబాద్ జిల్లాలో కూలీల కొరత వేధిస్తోంది. ఇక్కడి వారు ఉపాధి కొసం మలేషియా, కెనడాతో పాటు పలు దేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో జిల్లాలో కూలీల కొరత ఏర్పడుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులకు జిల్లా రైతులు ఆహ్వానం పలుకుతున్నారు. వరినాట్లు, హమాలీ పనులకు బిహార్, బెంగాల్, మహరాష్ట్ర నుంచి కూలీలు వస్తున్నారు. ఒక ఎకరం వరినాట్లు వేస్తే రూ. 4000 నుంచి రూ. 5000 వరకు కూలీ చెల్లిస్తున్నారు.
News July 11, 2025
నిజామాబాద్: వామ్మో.. డెంగ్యూ

నిజామాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు బెంబెలెత్తిస్తున్నాయి. గత నెలలో 25 కేసులు నమోదవ్వగా ఈనెలలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు డెంగీ, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలపై వైద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేసులు నమోదవుతున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కాచిచల్లార్చిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
News July 11, 2025
BHPL: రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలి

భూపాలపల్లి జిల్లాలోని రైతులందరూ ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు కోరుతున్నారు. ఫార్మర్ ఐడీ ఉంటేనే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాలకు అర్హులవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు సంబంధిత ఏఈవోలను సంప్రదించి ఫార్మర్ ఐడీని నమోదు చేసుకోవాలని కోరారు.