News April 12, 2025

గవర్నర్‌ను కలిసిన బాపట్ల కలెక్టర్ 

image

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బాపట్ల కలెక్టర్ వెంకట మురళీకృష్ణ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాలలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌కు గవర్నర్ వచ్చిన సందర్భంగా ఈ భేటీ జరిగింది. కలెక్టర్ బొకే అందించి గవర్నర్‌కు అభినందనలు తెలిపారు. ఆయనతోపాటూ ఎస్పీ, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, అధికారులు ఉన్నారు.

Similar News

News October 15, 2025

కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

image

కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై కామారెడ్డి నుంచి రామాయంపేట వైపు బైక్‌పై వెళ్తున్న వారిని రాంగ్ రూట్‌లో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 15, 2025

మొక్కజొన్న: కోతకు ముందు ఈ జాగ్రత్తలు..

image

మనుషులతోపాటు కోళ్లు, పశువులకు ఆహారం ఉపయోగించే ప్రధాన పంటల్లో మొక్కజొన్న ఒకటి. పంటను ఆశించే కాండం తొలుచు పురుగు, పేను బంక నివారణకు రైతులు పలు మందులను వాడుతుంటారు. అయితే కోత దగ్గర పడిన సమయంలో అనుమతికి మించి, సురక్షిత కాలాన్ని దాటి వాడటం మంచిది కాదు. వాడితే పంట ద్వారా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే పైన ఫొటోలో చూపినట్లుగా సురక్షిత కాలం, మోతాదును పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News October 15, 2025

అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

image

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.