News October 19, 2024
గవర్నర్ అబ్దుల్ నజీర్తో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ భేటీ

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డీవీజీ శంకర్రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్షేత్ర స్థాయిలో జరిపిన పర్యటనల్లో గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసి, కమిషన్ సిఫార్సులను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఏకలవ్య పాఠశాలల్లో భాషోపాధ్యాయుల సమస్య, గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాల కల్పనపై అభ్యర్థించారన్నారు. గిరిజనుల సంక్షేమానికి క్షేత్ర స్థాయి సర్వే చేయాలని కోరారన్నారు.
Similar News
News September 16, 2025
VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు వరం

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని సూచించారు.
News September 15, 2025
విజయనగరం ఎస్పీ కార్యాలయానికి 32 ఫిర్యాదులు

ఫిర్యాదు చేసిన బాధితుల సమస్యలను పోలీసు అధికారులు చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ పి.సౌమ్య లత అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ప్రజల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించారు. బాధితుల ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి 7 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
News September 15, 2025
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు అధికారులు ఉక్కు పాదం మోపాలని జిల్లా SP ఏఆర్ దామోదర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన సోమవారం తన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను వివరించి, నిర్వహించాల్సిన విధుల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల పరిధిలో ప్రధాన నేరాలు, శాంతి భద్రతల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.