News October 25, 2024
గవర్నర్ ఖమ్మం, కొత్తగూడెం పర్యటన వివరాలు

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 8గంటలకు భద్రాచలం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 9గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో అధికారులతో భేటీ కానున్నారు. 10 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో కళాకారులు, రచయిత లతో సమావేశం అవుతారు. 11గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1గంట వరకు ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. 2గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు పయనం అవుతారు.
Similar News
News December 2, 2025
2వ రోజు 383 నామినేషన్లు దాఖలు.!

ఖమ్మం జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 6 మండలాల్లో సోమవారం సర్పంచ్ల పదవికి 383.. వార్డులకు 895 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో కలిపి కామేపల్లిలో S-49 W-142, KMM(R) S-65 W-167, KSMC S-87 W-153, MGD S-78 W-160, NKP S-70 W-155, T.PLM S-79 W-154 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో 2వ విడత నామినేషన్ల స్వీకరణ ముగియనుంది.
News December 2, 2025
ఖమ్మం: ఏఎన్ఎం కోర్సు ప్రవేశాలకు నేడే ఆఖరు

ఖమ్మం టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా-శిశు వికాస కేంద్రంలో 2025-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంపీహెచ్డబ్ల్యూ (మహిళా)/ఏఎన్ఎం కోర్సు ప్రవేశాలకు మంగళవారం చివరి గడువు అని మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ఉచిత శిక్షణలో బీసీ-సీ, ఈ, ముస్లిం మైనారిటీలకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 76600 22512ను సంప్రదించవచ్చు.
News December 2, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో Dy.CM భట్టి విక్రమార్క పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన


