News October 25, 2024

గవర్నర్ ఖమ్మం, కొత్తగూడెం పర్యటన వివరాలు 

image

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉదయం 8గంటలకు భద్రాచలం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 9గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో అధికారులతో భేటీ కానున్నారు. 10 గంటలకు కొత్తగూడెం కలెక్టరేట్లో కళాకారులు, రచయిత లతో సమావేశం అవుతారు. 11గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1గంట వరకు ఖమ్మంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 2గంటలకు ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు పయనం అవుతారు.

Similar News

News December 5, 2025

కోతుల సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్

image

కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. పోడు భూముల పట్టా ఉన్నవారు ఎవరైనా అడవి జంతువుల వేటకు పాల్పడిన, అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నించిన గతంలో జారీ చేసిన పట్టా రద్దు చేయాలని చెప్పారు. యువత, పిల్లలను ఆకర్షించేలా అర్బన్ పార్క్‌లో జంతువులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డుపై ఎక్కడ కూడా కోతులకు ఆహార పదార్థాలు ఇవ్వవద్దని పేర్కొన్నారు.

News December 5, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} మూడో రోజు కొనసాగుతున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ మధుసూదన్ పర్యటన

News December 5, 2025

మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్‌కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.