News July 28, 2024

గవర్నర్ దత్తాత్రేయ నివాసంలో బోనాల వేడుకలు

image

ఆషాడ మాసం బోనాలను పరిష్కరించుకొని రామ్ నగర్ లోని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో ఆదివారం నిర్వహించిన బోనాల వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను చెప్పారు.

Similar News

News November 28, 2025

HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

image

మా ఊరు గ్రేటర్‌లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

News November 28, 2025

HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

image

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్‌గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.

News November 28, 2025

OU: పూర్తిస్థాయి కమిటీని ఎప్పుడు నియమిస్తారో?

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఓయూ ఈసీ కమిటీ ఖాళీలతో నడుస్తోంది. వర్సిటీలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీనే కీలకం. అలాంటిది సర్కారు ఈ విషయం గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీలో 12 మందికి గానూ వీసీ ప్రొ.కుమార్, డా.యోగితా రాణా, శ్రీదేవసేన, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు.