News March 11, 2025
గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్న కేసీఆర్

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !
Similar News
News January 16, 2026
HYD: సంక్రాంతి.. తేదీ ఎందుకు మారిందో తెలుసా?

మకర సంక్రాంతి పండుగ తేదీల్లో మార్పు వెనుక ఆసక్తికర శాస్త్రీయ కారణం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఏటా 20 నిమిషాలు ఆలస్యమవుతోందని HYDలోని ఓ ఖగోళ నిపుణుడు తెలిపారు. దీంతో ప్రతి 72 ఏళ్లకు ఒక రోజు చొప్పున పండుగ తేదీ మారుతోంది. 1935-2007 వరకు జనవరి 14న వచ్చిన పండుగ, 2008 నుంచి జనవరి 15న వస్తోంది. ఈ లెక్కల ప్రకారం 2081లో జనవరి 16న సంక్రాంతి రానుంది.
News January 16, 2026
HYD: సంక్రాంతి.. తేదీ ఎందుకు మారిందో తెలుసా?

మకర సంక్రాంతి పండుగ తేదీల్లో మార్పు వెనుక ఆసక్తికర శాస్త్రీయ కారణం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఏటా 20 నిమిషాలు ఆలస్యమవుతోందని HYDలోని ఓ ఖగోళ నిపుణుడు తెలిపారు. దీంతో ప్రతి 72 ఏళ్లకు ఒక రోజు చొప్పున పండుగ తేదీ మారుతోంది. 1935-2007 వరకు జనవరి 14న వచ్చిన పండుగ, 2008 నుంచి జనవరి 15న వస్తోంది. ఈ లెక్కల ప్రకారం 2081లో జనవరి 16న సంక్రాంతి రానుంది.
News January 16, 2026
గ్రీన్లాండ్కు భారీగా యూరోపియన్ సైనిక బలగాలు

గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామని US అధ్యక్షుడు ట్రంప్ <<18784880>>వ్యాఖ్యల<<>> నేపథ్యంలో యూరోపియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. డెన్మార్క్కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నార్వే సహా పలు దేశాలు గ్రీన్లాండ్కు సైనిక బలగాలను పంపుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్ సైనికులు గ్రీన్లాండ్ రాజధాని నూక్ చేరుకోగా, జర్మనీ సైతం సైనిక బృందాన్ని మోహరించింది. నాటో దేశాల ఐక్యతను చూపించేందుకే ఈ బలగాల మోహరింపు అని సమాచారం.


