News April 9, 2025

గాంధారి: కారు బోల్తా.. యువతి మృతి

image

గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈ ఘటలో అంజలి పూజ మృతి చెందగా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. 

Similar News

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 23, 2025

NGKL: గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!

image

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 26, లేదంటే 27 తేదీలలో వెలువడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రావలసి ఉంది. జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంచకుండా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.