News January 23, 2025

గాంధారి: నిరుపేదలకు పథకాలు అమలులో ప్రాధాన్యత: కలెక్టర్

image

అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపారు. నాలుగు పథకాలలో అర్హులైన ముసాయిదా జాబితాలను గ్రామసభలో చదివి వినిపించారు.

Similar News

News November 21, 2025

ఖమ్మం: హత్య జరిగి 21 రోజులు.. నిందితుల జాడేదీ?

image

చింతకాని(M) పాతర్లపాడు మాజీ సర్పంచి, CPM నేత సామినేని రామారావు హత్య జరిగి 21 రోజులు అవుతున్నా, సుపారీ గ్యాంగ్‌కు సంబంధించిన నిందితులను పోలీసులు గుర్తించలేకపోతున్నారు. హంతకులు ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఇది రాజకీయ హత్యేనని, దర్యాప్తు జాప్యానికి అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని CPM నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా ఈనెల 25న దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.

News November 21, 2025

వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

image

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తొంది‌. కార్పొరేషన్‌గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతోంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్‌లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.

News November 21, 2025

పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

image

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.