News January 23, 2025

గాంధారి మైసమ్మ జాతర పోస్టర్ల విడుదల

image

గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ప్రచార పోస్టర్లను గురువారం చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. జాతర విజయవంతం కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు భార్గవ్, రమేష్, మహేందర్, రాజేష్, అరుణ్, పృథ్వీ, భీమేష్ పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

తిరుపతి: అర్చకుల మధ్య వివాదం.. అందుకోసమేనా.?

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకుల మధ్య <<18509949>>కోల్డ్‌వార్<<>> కాకరేపుతోంది. ఆలయంలో కొత్తగా నాలుగు పరిచారకుల పోస్టుల భర్తీ కానున్నాయి. వీటిని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అనాధికారిక వ్యక్తులను పరిచారికులుగా చేర్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారట. మరి విజిలెన్స్ అధికారులు దీనిపై విచారణ చేశారా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.

News December 9, 2025

25 మంది మృతి.. థాయ్‌లాండ్‌కి పరారైన ఓనర్లు

image

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన <<18501326>>అగ్నిప్రమాదం<<>>లో 25 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన తర్వాత క్లబ్ ఓనర్లు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల్లోనే డిసెంబర్‌ 7న ఇండిగో విమానం 6E 1073లో వారు దేశం విడిచినట్లు వెల్లడైంది. వీరిద్దరిపై పోలీసులు FIR నమోదు చేశారు. ప్రస్తుతం ఇంటర్‌పోల్ సహాయంతో వారి అరెస్ట్‌కు చర్యలు చేపట్టారు.

News December 9, 2025

నువ్వుల సాగు.. విత్తనశుద్ధి, విత్తే పద్ధతి

image

నేల నుంచి సంక్రమించే తెగుళ్లను నివారించడానికి కిలో విత్తనానికి కార్బండిజం 2.5గ్రా. లేదా మాంకోజెబ్ 3గ్రా. కలిపి విత్తనశుద్ధి చేయాలి. పంట తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడటానికి కిలో విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5ml కలిపి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30సెం.మీ, మొక్కల మధ్య 15సెం.మీ దూరం ఉండేటట్లు విత్తాలి. విత్తనాన్ని వెదజల్లడం కంటే విత్తడం మేలంటున్నారు నిపుణులు.