News January 31, 2025
గాంధీజీకి నివాళులర్పించిన మహబూబాబాద్ కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్, జిల్లా అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
వరంగల్: రజాకార్ల ఆకృత్యాలు.. నెత్తుటి గాథలు!

రజాకార్ల పాలనలో ఓరుగల్లు పోరాటాల గడ్డగా నిలిచింది. విమోచన ఉద్యమ చరిత్రలో బత్తిని మొగిలయ్య గౌడ్ వారిపై దండెత్తాడు. బైరాన్పల్లి గ్రామం, పరకాల, కూటిగల్, తొర్రూరు కడవెండి, అమ్మాపూర్, నాంచారి మడూర్, జాఫర్ఘడ్, మధిర, ఖిలా వరంగల్ కోట వంటి గ్రామాలపై రజాకార్లు విరుచుకుపడి వందలాదిమంది ఉద్యమకారులను కాల్చి చంపారు. ఇప్పటికీ పరకాల, బైరాన్పల్లి నెత్తుటి గాథలు అక్కడ ఇంకా సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.
News September 17, 2025
నిర్మల్: అతిథి అధ్యాపకుల వేతన వ్యథలు

నిర్మల్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 37 మంది అతిథి అధ్యాపకులకు ఇప్పటివరకు 3 నెలలుగా వేతనాలు రావడం లేదని డిగ్రీ అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు టి.సురేందర్ పేర్కొన్నారు. రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ సరైన సమయానికి వేతనాలు రాక ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం దసరా పండుగ లోపు బకాయిలు ఖాతాలో జమ చేయాలని కోరారు.
News September 17, 2025
హార్టీకల్చర్ కోర్సులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం: శ్రీనివాసులు

తాడేపల్లిగూడెం (M) వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధి కళాశాలలో బీఎస్సీ హార్టీకల్చర్, ఫారెస్టరీ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో నమోదు చేసుకున్న దరఖాస్తుదారులకు ఈ నెల 18వ తేదీ లోపు కాలేజీ ఎంపికకు అవకాశం కల్పించారన్నారు.