News July 5, 2024

గాంధీనగర్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

image

తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అబ్దుల్ రజాక్ కూతురు(13) ఇటీవల బన్సీలాల్ పేట్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకొని వచ్చింది. అంతదూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 11, 2025

ఈసారి జూబ్లీహిల్స్‌ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

image

2009లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్‌ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. ఓటేస్తేనే అడిగే హక్కు..!

image

భారత రాజ్యాంగం మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చింది.. దానిని మీ వద్దే ఉంచుకుంటే ఎలా? ఇప్పుడు బయటకు తీయండి. మా ఏరియాలో ఆ సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలున్నాయి.. ఎవరూ పట్టించుకోరు అని చాలా మంది నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా అలా చేసి ఉంటారు. ఇటువంటి ఎన్నికల సమయంలో మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి.. మనల్ని పట్టించుకునే వారే ఉండరు. ఓటేసేందుకు కదలిరండి.

News November 11, 2025

జూబ్లీహిల్స్: నేడే పోలింగ్.. ఓటే ఆయుధం..!

image

గెలుపు ఓటములను డిసైడ్ చేసేందుకు ఒక్క ఓటు చాలు. ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేడు జరగనుంది. మీ ఓటును ఆయుధంగా వాడండి.
> మొత్తం ఓటర్లు: 4,01,365
> పురుషులు: 2,08,561
> మహిళలు: 1,92,779
> ఇతరులు: 25
> బీసీలు: 1.50-1.80 లక్షలు, ముస్లింలు: 96,500, ఎస్సీలు: 26,000, కమ్మ: 17,000, రెడ్లు: 18,000, యాదవులు: 15,000, క్రిస్టియన్లు: 10,000
> కొత్త ఓటర్లు: 12,380 (18-19 ఏళ్లు)