News December 9, 2024

గాంధీభవన్‌లో మెగా రక్తదాన శిబిరం

image

గాంధీ భవన్‌లో సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ ముంన్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 24, 2025

HYD: CM సార్.. జర మా వైపు చూడండి!

image

పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఆ జీవి రోడ్డెక్కాల్సిందే. చలి, వాన, ఎండ ఎరుగరు. ఏం చేస్తా మరి.. రెక్కాడితేనే డొక్కాడే జీవితాలు. బల్దియా కార్మికుల బాధ ఇది. ‘లక్షలు జీతాలు తీసుకునే వారికే పండుగ బోనస్‌లు.. మా వైపు ఎవరు చూస్తారు సార్’ అంటూ ఓ కార్మికుడు Way2Newsతో వాపోయాడు. వాస్తవానికి సిటీని క్లీన్ చేయడంలో పారిశుద్ధ్య సిబ్బంది కీలకం. CM చొరవ చూపితే తమ జీవితాలు బాగుపడతాయని కార్మికులు వేడుకుంటున్నారు.

News October 24, 2025

బస్సు ప్రమాదంలో.. పటాన్‌చెరు వాసులు మృతి

image

కర్నూల్ బస్సు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి చెందారు. బెంగళూరు వెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కృషి డిఫెన్స్ కాలనీకి చెందిన రాము, అతని తల్లి పటాన్‌చెరులో బస్సు ఎక్కారు. దీపావళి పండుగకోసం బెంగళూరు నుంచి స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 24, 2025

HYD: షాకింగ్.. 3 రోజుల్లో ముగ్గురు ఫ్రెండ్స్ సూసైడ్

image

అబ్దుల్లాపూర్‌మెట్(మం) కోహెడలో మూడు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. వీళ్లు 6th-10th కలిసి చదువుకున్నారు. గ్యార వైష్ణవి(18) మంగళవారం ఉరేసుకుంది. ఆమె క్లాస్మెట్ సతాలీ రాకేశ(21) ఇంటి సమీపంలో ఓ షెటర్లో బుధవారం ఉరేసుకున్నాడు. అదే ఊరిలోని బుద్ధ శ్రీజ(18) గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని కనిపించింది. దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు.