News October 2, 2024
గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శం: ఎస్పీ
మహాత్మ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు.
Similar News
News October 2, 2024
కర్నూలు: 24 గంటల్లో మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు
పత్తికొండ మండలం పుచ్చకాయలమడకు చెందిన అశోక్ అనే నిరుద్యోగి తనకు ఆటో ఇప్పించాలని నిన్న సీఎం చంద్రబాబును కోరిన విషయం తెలిసిందే. సీఎం హామీ మేరకు బుధవారం అశోక్కు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ రంజిత్ బాషా ఆటో పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబ శివారెడ్డి పాల్గొన్నారు.
News October 2, 2024
రేపటి నుంచి టెట్ పరీక్ష ప్రారంభం
కర్నూలు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేశారు. దాదాపు 40,660 మంది పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తున్నారు. కర్నూలులో 4, ఆదోని, ఎమ్మిగనూరులో ఒక్కొక్క కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర పరిశీలకుడు నరసింహారావు, విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ ఏర్పాట్లను పరిశీలించారు.
News October 2, 2024
ఎమ్మిగనూరులో 4న జాబ్ మేళా.. కరపత్రాలు విడుదల చేసిన ఎమ్మెల్యే
ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.