News March 23, 2025

గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి

image

తాడేపల్లిగూడేనికి చెందిన గాంధేయవాది పసల కృష్ణభారతి (92) కన్నుమూశారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని ప్లాట్‌లో ఆమె మృతి చెందారు. 2022 జులైలో భీమవరం వచ్చినప్పుడు ప్రధాని ఆమె కాళ్లకు నమస్కరించారు. తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మీ దంపతులకు కుమార్తె. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో కృష్ణమూర్తి దంపతులు కీలక పాత్ర షోషించారు. ఆ సమయంలో అంజలక్ష్మీ తంజావూరు జైలులో కృష్ణభారతికి జన్మనిచ్చింది.

Similar News

News October 26, 2025

ANU రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో ఏప్రిల్ 2025లో నిర్వహించిన M.B.A, PG రీవాల్యుయేషన్ ఫలితాలను శనివారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. M.B.A 4-సెమిస్టర్, M.SC 3-సెమిస్టర్ ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, M.SC 1-సెమిస్టర్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్& టెక్నాలజీ సబ్జెక్టుల రీవాల్యుయేషన్ ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ చూడాలన్నారు.

News October 26, 2025

KG చికెన్ ధర ఎంతంటే?

image

కార్తీక మాసం ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెద్దగా తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ కేజీ రూ.220-240, సూర్యాపేటలో రూ.220గా ఉంది. ఏపీలోని విజయవాడలో రూ.240, విశాఖలో రూ.270, చిత్తూరులో రూ.220-245, కర్నూలులో రూ.200-240 వరకు పలుకుతోంది. ఆదివారం కావడంతో రేట్లు తగ్గలేదని, రేపటి నుంచి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.

News October 26, 2025

WGL: లక్కు ఎవరికైనా.. కిక్కు అందరికీ ఉండాలి..!

image

మద్యం షాపులకు లక్కీ డ్రా సమయం మరో 24 గంటలు మాత్రమే ఉంది. ఇప్పటికే సిండికేట్‌గా మారి టెండర్లు దాఖలు చేసిన వ్యాపారులు ముందస్తు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. లైసెన్స్ దక్కిన వ్యక్తులు చేజారకుండా న్యాయపరంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు తమ మహిళల పేరుపై దరఖాస్తులు చేశారు. లక్కు ఎవరికైనా కిక్కు మాత్రం అందరికీ ఉండాలని, చేజారితే చిక్కులు తప్పవంటున్నారు.