News February 5, 2025

గాజువాకలో ఫార్మా ఉద్యోగి మృతి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాకలో ఫార్మసిటీ ఉద్యోగి భాస్కరరావు మృతి కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని గాజువాక సీఐ పార్థసారథి తెలిపారు. వీరు హింసించి, ఆత్మహత్యకు ప్రేరేపించడం వల్లే అతను మృతి చెందాడని ప్రాథమిక విచారణలో వెల్లడయ్యిందన్నారు. ఈ కేసులో ఏ-1 హేమంత నర్సింగ్ కుమార్(కూర్మన్నపాలెం), ఏ-2 ప్రియాంక(గాజువాక), ఏ-3 కర్రి లక్ష్మి(శ్రీనగర్), ఏ-4 హేమ శేఖర్, ఏ-5గా మణికంఠను రిమాండ్‌కు తరలించామన్నారు. 

Similar News

News February 19, 2025

విశాఖపట్నం టుడే టాప్ న్యూస్

image

☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్

News February 19, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్య‌త‌కు పెద్ద‌పీట వేయాలి: జిల్లా కలెక్టర్

image

ఎన్.టి.ఆర్. కాల‌నీల్లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌కుండా ప‌నుల‌ను వేగ‌వంతంగా చేయాల‌ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. బుధ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగ‌తి, ఇసుక స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌పై ఆయన స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

News February 19, 2025

మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.

error: Content is protected !!