News February 15, 2025
గాజువాక: పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్మెంట్లో లక్ష్మణరావు వాచ్మెన్గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.
Similar News
News March 12, 2025
విశాఖలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి

స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉపాధి, శిక్షణ కల్పిస్తున్నట్లు సీఈవో ఇంతియాజ్ ఆర్షేడ్ బుధవారం తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 15వ తేదీలోపు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సముదాయంలో ఉన్న ఆఫీసులో సంప్రదించాలని కోరారు. ఐటిఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ అభ్యర్థులకు శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
News March 12, 2025
గృహ నిర్మాణాల కోసం అదనపు ఆర్థిక సాయం: కలెక్టర్

విశాఖ జిల్లాలో అసంపూర్తి ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ఇళ్లు మంజూరై ఇంకా వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న ఇళ్లకు సాయం అందిస్తామన్నారు. యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు 75 వేలు, పీవీటీజీలకు రూ.లక్ష చొప్పున అదనపు సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.