News March 7, 2025

గాజువాక: రోడ్డు ప్రమాదంలో సచివాలయం ఉద్యోగి మృతి

image

సచివాలయ ఉద్యోగి డాక్ యార్డ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కూర్మన్నపాలెం సచివాలయం-1 మహిళా పోలీస్‌గా పనిచేస్తున్న మీను స్కూటీపై తన కుమార్తెతో నగరానికి వెళ్లి తిరిగి వస్తుండగా మారుతి సర్కిల్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కుమార్తె గాయపడగా ఆసుపత్రికి తరలించారు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 10, 2025

విశాఖలో రౌడీ షీటర్స్‌కు కౌన్సెలింగ్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా SI సునీత ఆదివారం PMపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురు రౌడీ షీటర్స్‌ను సత్ప్రవర్తనతో వ్యవహరించాలని సూచించారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News March 9, 2025

విశాఖ: రేపటి నుంచి యథావిధిగా పీజీఆర్ఎస్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వినతుల స్వీకరణ కార్యక్రమం 10వ తేదీ నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా గత కొన్ని వారాల నుంచి రద్దైన సంగతి తెలిసిందే. కోడ్ ముగిసిన క్రమంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 9, 2025

ద్వారకానగర్‌లో యువతి ఆత్మహత్య

image

ద్వారకానగర్‌లో ఓ యువతి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రమీల(20) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆదివారం ఉదయం రూములో ఉరివేసుకుని చనిపోయింది. యువతి తండ్రి రామినాయుడు ద్వారకానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరి సమాచారం మేరకు ద్వారకానగర్ ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!