News September 28, 2024
గాజువాక: హెల్మెట్ ఉన్నా.. భార్య, కూతురికి తప్పని శోకం
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో షీలా నగర్ రహదారిపై శుక్రవారం డాక్ యార్డ్ ఉద్యోగి దిలీప్ కుమార్(33) మృతిచెందిన విషయం తెలిసిందే. అల్లూరి జిల్లా హుకుంపేటకు చెందిన ఇతను పెందుర్తి మం. సరిపల్లిలో ఉంటున్నారు. విధులు ముగించుకొని బైకుపై వెళ్తుండగా టోల్ గేట్ సమీపంలో లారీ ఢీకొనగా, దిలీప్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. హెల్మెట్ ఉన్నా ప్రాణాలు దక్కలేదని కుటుంబ సభ్యులు రోదించారు.
Similar News
News October 10, 2024
విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
పండగల సీజన్లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-విజయవాడ స్పెషల్ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం నుంచి ఈనెల 10 నుంచి 18 వరకు(14 మినహా) నడుస్తుందన్నారు.
News October 10, 2024
విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు
విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.
News October 10, 2024
విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం
కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.