News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News March 13, 2025
మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 17 నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ తెలిపింది మార్చి 18 నుంచి మే 22 లోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. టెన్త్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్, రిజర్వేషన్ల ప్రతిపాదికన మే 26న సీట్లు కేటాయిస్తారు. 27న వెరిఫికేషన్ నిర్వహిస్తారు. జూన్లో తరగతులు ప్రారంభమవుతాయి. apms.ap.gov.in
News March 13, 2025
వికారాబాద్: విషాదం.. యువకుడి మృతి

వికారాబాద్ జిల్లా దోమ మండలం మైలారం వద్ద జరిగిన <<15741649>>రోడ్డు ప్రమాదంలో<<>> మోత్కూర్ గ్రామానికి చెందిన సాయికుమార్, ధన్రాజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిని స్థానికులు పరిగి ప్రభుత్వాసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ధన్రాజ్ ఈరోజు తెల్లవారుజామున మరణించాడని, సాయి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
News March 13, 2025
మళ్లీ జగన్ను CMను చేసుకుందాం: మేకపాటి

వైసీపీ అధినేత జగన్.. CMగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీలకన్నా అదనపు సంక్షేమ పథకాలు ఇచ్చారని ఆ పార్టీ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి కొనియాడారు. 2014-19 వరకు ఐదేళ్ల చంద్రబాబు పాలనను అనుభవించి కూడా మళ్లీ ఆయనకే పట్టం కట్టి ప్రజలు మోసపోయారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రశ్నించాలన్న ఆయన మరోసారి వచ్చే ఎన్నికలల్లో జగన్ను CMను చేసుకుందామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.