News March 12, 2025
గార్ల: బైక్ యాక్సిడెంట్ మహిళకు తీవ్ర గాయాలు

గార్ల మండలంలోని పూమ్యా తండా శేరిపురం వెళ్లే రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు బుధవారం ఢీకొన్నాయి. ఒక ద్విచక్ర వాహనంపై మహిళా డ్రైవింగ్ చేస్తుండగా, మరొక వాహనం ఎదురుగా వచ్చి ఢీకొనడంతో మహిళకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. తోటి వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News April 11, 2026
GNT: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నందిగం సురేశ్

కాకినాడకు సంబంధించిన ఓ చర్చి ట్రస్ట్ రెన్యూవల్ కోసం మాజీ MP నందిగం సురేశ్ ఓ వ్యక్తి నుంచి రూ. 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సురేశ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు.
News April 11, 2026
కాళేశ్వరం ప్రాజెక్ట్.. సీఎం టైం బాండ్ అతిపెద్ద సవాల్

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో 2023 నుంచి సాంకేతిక లోపాలతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులపై సమీక్షించిన సీఎం వానకాలంలోపు పూర్తిచేయాలని టైం బాండ్ పెట్టడంతో ఇరిగేషన్ శాఖ టెన్షన్ పడుతోంది. దెబ్బతిన్న బ్యారేజీలు, పంపు హౌస్లో సాంకేతిక సమస్యలు, క్లిష్టమైన ఇంజినీరింగ్ పనులు ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.
News April 11, 2026
పెనుముప్పుగా ప్లాస్టిక్

కోవెలకుంట్ల <<19621324>>ఘటన<<>> అందరినీ హెచ్చరిస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై వేయడంతో పశువులు తిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నాయి. పర్యావరణానికే కాకుండా మూగజీవాల మనుగడకు ప్లాస్టిక్ శాపంగా మారింది. ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగకపోతే ఇలాంటి దారుణాలు మరిన్ని జరుగుతాయి. ఇకనైనా ప్లాస్టిక్ వినియోగాన్ని విడనాడదాం. మన అజాగ్రత్తతో మూగజీవాల ప్రాణాలను బలి తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండి పర్యావరణాన్ని కాపాడుకుందాం.


