News January 26, 2025

గార: పురుగుల మందు తాగి .. యువకుడి ఆత్మహత్య

image

కడుపు నొప్పి తట్టుకోలేక కుమ్మరిపేట గ్రామానికి చెందిన కె.శ్రావణ్ కుమార్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎచ్చెర్ల IIITలో ఔట్సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. శనివారం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు ఎస్ఐ జనార్దన్ తెలిపారు.

Similar News

News January 6, 2026

SKLM: క్రీడలు, మైదానాల అభివృద్ధి సహకరించండి

image

శ్రీకాకుళం జిల్లాలో క్రీడలు, మైదానాల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందివ్వాలని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. మంగళవారం ఆయనతో ప్రత్యేకంగా భేటి అయ్యారు. పాత్రునివలస రెవెన్యూ పరిధిలో 33 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి ఆయనకు వివరించారు. మైదానాలు అభివృద్ధి చేయాలన్నారు.

News January 6, 2026

ఎస్సీ కులాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట: SKLM కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు ఆర్థిక ఊరట కల్పిస్తూ ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. NSFDC, ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకాల కింద రుణాలు పొంది, వడ్డీ చెల్లించలేని వారి కోసం వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 273 మంది లబ్ధిదారులకు రూ.180.70 లక్షలు వడ్డీ ప్రభుత్వం రద్దు చేస్తోందన్నారు.

News January 6, 2026

రోడ్డు ప్రమాదంలో సిక్కోలు వాసి మృతి

image

విజయనగరం జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగం మండలం కాపుతెంబూరు గ్రామానికి చెందిన జీ.నగేశ్ (30) అనే యువకుడు దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి లగేజీ వ్యాన్‌పై టెక్కలి వైపు సామాగ్రి తీసుకువస్తుండగా రోడ్డుపక్కన బండి ఆపి రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.