News January 26, 2025

గార: పురుగుల మందు తాగి .. యువకుడి ఆత్మహత్య

image

కడుపు నొప్పి తట్టుకోలేక కుమ్మరిపేట గ్రామానికి చెందిన కె.శ్రావణ్ కుమార్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను ఎచ్చెర్ల IIITలో ఔట్సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నిరోజులుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. శనివారం పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసినట్లు ఎస్ఐ జనార్దన్ తెలిపారు.

Similar News

News October 15, 2025

SKLM: అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచనలు

image

ప్రభుత్వ సేవలను ప్రజల గుమ్మం దాకా చేరవేయడమే తమ ప్రధాన ధ్యేయమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, వేగం పెంపుతో ప్రజల్లో సానుకూల అభిప్రాయం నెలకొల్పాలని సూచించారు. రెవెన్యూ ఫిర్యాదులు, కోర్టు కేసులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.

News October 14, 2025

ఎచ్చెర్ల: క్యాంటీన్ నిర్వహణకు వర్శిటీ దరఖాస్తుల ఆహ్వానం

image

ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఉన్న క్యాంటీన్ నిర్వహణకు ఆసక్తిగల వారి నుంచి సంబంధిత దరఖాస్తులను వర్శిటీ ఆహ్వానిస్తుందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి దీనికి సంబంధించిన వివరాలు, దరఖాస్తు ఫారమ్ వంటివి వర్శిటీ www.brau.edu.inలో అందుబాటులో ఉంటాయన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వర్శిటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి అందజేయాలన్నారు.

News October 14, 2025

ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 42 శాతం ప్రవేశాలు’

image

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.