News July 4, 2024
గిద్దలూరు: కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య

గిద్దలూరు మండలం కొంగలవీడు రహదారిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారి గుడి సమీపంలో రవణమ్మ అనే 15 సంవత్సరాల యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రవనమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా.. రవణమ్మ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలతో వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
News December 16, 2025
సమస్యలు నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలతో వచ్చే ప్రజలతో అధికారులు మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
News December 15, 2025
ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.!

మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో రేపు CM చంద్రబాబు చేతులమీదుగా కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 281 మంది అభ్యర్థులు మంగళవారం ఉదయం ఒంగోలు SP కార్యాలయం నుంచి మంగళగిరికి బయలుదేరతారు. సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ 38 మంది, సివిల్ కానిస్టేబుల్స్ 88 మంది, ఏపీఎస్పీ 155 మంది వీరిలో ఉన్నారు.


